పాకిస్థాన్ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా

పాకిస్థాన్ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా
X
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) షాక్ ఇచ్చింది. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) షాక్ ఇచ్చింది. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై పిసిబి ఐసిసికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఐసిసి సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ పహల్గాం ఉగ్రదాడి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ఐసిసి రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఈ చర్యలు తీసుకున్నాడు. అంతేగాక సూపర్4 మ్యాచ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన పాక్ క్రికెటర్లు హారిస్ రవూఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌లపై కూడా చర్యలు తీసుకుంది.

Tags

Next Story