సిరిసిల్లలో రూ.10 లక్షల విలువైన 2.3 కిలోల వెండి ఆభరణాలు సీజ్

సిరిసిల్లలో రూ.10 లక్షల విలువైన 2.3 కిలోల వెండి ఆభరణాలు సీజ్
X

సిరిసిల్ల మున్సిపాల్టీ పరిధిలోని రగుడు చెక్‌పోస్ట్‌వద్ద శనివారం ఉదయం పోలీసులు సరైన ధృవపత్రాలులేని రూ.10 లక్షలు విలువ చేసే 2.3 కిలోల వెండి ఆభరణాలను సీజ్ చేశారు. మెట్‌పల్లి నుంచి సిరిసిల్లకు కారులో తరలిస్తున్న రెండు కిలోల మూడు వందల గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు చెక్‌పోస్టు వద్ద వాహన తనఖీలో పట్టుకుని పంచునామ చేసి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం రూ. 20 లక్షలు కూడా ఇక్కడే పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Tags

Next Story