రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు

రేపు  హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
X

హైదరాబాద్ నగర రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈవీట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను బుధవారం రాణిగంజ్ డిపో లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆర్‌టిసి ఎండి వై నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఉదయం పది గంటలకు బస్సుల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఆర్‌టిసి ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రూట్లలో నడుపుతోంది.

Tags

Next Story