తూర్పు గోదావరిలో స్కూల్ బస్సు బోల్తా..10 మంది విద్యార్థులకు గాయాలు

తూర్పు గోదావరిలో స్కూల్ బస్సు బోల్తా..10 మంది విద్యార్థులకు గాయాలు
X

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద ప్రమాదం జరిగింది. తాటిపర్రులోని జ్యోతి స్కూల్ కు చెందిన 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు, ఏటిగట్టుపై మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక విద్యార్థిని కాలికి తీవ్ర గాయం కావడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story