తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Tirumala Temple
X

Tirumala Temple

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. సంక్రాంతి పండగ తర్వాత తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 9 గంటల సమయం పడుతుంది.

ఇక, శుక్రవారం తిరుమల వెంకన్నను 69,254 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 20,954 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

Tags

Next Story