థాయిలాండ్ పారిపోయిన గోవా నైట్‌క్లబ్ యజమానులు

థాయిలాండ్ పారిపోయిన గోవా నైట్‌క్లబ్ యజమానులు
X

25మంది మరణానికి కారణమైన గోవా నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని గుర్తించేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరినట్లు పోలీసులు వెల్లడించారు. అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు ఓనర్లు ఆదివారం తెల్లవారుజామున ఫుకెట్‌కు పారిపోయారని గోవా పోలీసులు సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ క్రమంలో గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరామని వివరించారు.

Tags

Next Story