మళ్లీ పెరిగిన గోల్డ్.. తులం ఎంతైందంటే?

X
మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల పసిడి, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోతున్నాయి. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరలకు చేరుకుంటున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.710 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరపై రూ.650 పెరిగింది. దీంతో తులం గోల్డ్ లక్ష 30 వేల రూపాయలకు చేరుకుంది. ఇక, కేజీ వెండిపై ఏకంగా రూ.3వేలు పెరిగింది. దీంతో వెండి ధర రెండు లక్షల రూపాయలకు చేరువైంది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,30,580కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,700కు పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.1,91,000కు దూసుకెళ్లింది.
Next Story
-
Home
-
Menu
