కోఠి ఎస్ బిఐ బ్యాంక్ వద్ద కాల్పులు..

X
హైదరాబాద్ నగరంలొోని కోఠిలో కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం ఉదయం కోఠిలోని ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం ఎటిఎం వద్ద కొందరు దుండగులు కాల్పుల జరిపారు. నగదు డిపాజిట్ చేయడానికి వచ్చినే రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి దాదాపు 6 లక్షల రూపాయలను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగలడంతో గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన రషీద్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సిసిటీవి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
