భార్య పుట్టింటిని తగలబెట్టిన భర్త

X
ఆసిఫాబాద్: భార్య మీద కోపంతో ఆమె పుట్టింటినే భర్త తగలబెట్టాడు. ఈ సంఘటన కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జైనూరు మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్ అనే యువకుడు ఎల్లాటాపార్కు చెందిన షమాబీ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ముజాహిద్కు ఆమెను పెళ్లి చేసుకోవడంతో ఇష్టం లేకపోవడంతో భార్యతో గొడవకు దిగాడు. దంపతుల మధ్య వివాహం జరిగినప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. 20 రోజుల క్రితం షమాబీ తన పుట్టింటికి వెళ్లింది. అల్లుడు అత్తారింటికి చేరుకొని భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఇల్లు పూర్తిగా దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
