చెలరేగుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం హార్దిక్ పాండ్యా, అక్షపటేల్.. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత అక్షర్(23) కూడా వెనుదిరగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా(15), శివమ్ దూబే(0)లు ఉన్నారు.
-
Home
-
Menu
