బిసి రిజర్వేషన్లపై ధర్మ యుద్ధం చేస్తున్నాం: జాజుల

BC reservations should be increased : Jajula Srinivas Goud
మన తెలంగాణ/హన్మకొండ: బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరపున పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా జరుగుతున్న బీసీల ధర్మ పోరాట దీక్షల ముగింపుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ దీక్షలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పై చర్చకు పెట్టీ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాలని, లేదంటే డిసెంబర్ మొదటి వారంలో వేలాదిమందితో పార్లమెంటును దిగ్బంధం చేస్తామని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా కష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పడాని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిసెంబరు ఒకటవ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షoతో వెళ్లాలనీపార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం పల్లె నుండి పట్నం దాకా బీసీలు పోరాడుతారని 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదనీ, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరహలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరాలు బీసీ ఉద్యమించి విజయం సాధించాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారుకేయూ బీసీల ధర్మ పోరాట దీక్ష ముగింపు సందర్భంగా బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డా. సంగాని మల్లేశ్వర్, డా. చిర్ర రాజు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, వరంగల్ శ్రీనివాస్, భీమగాని యాదగిరి, మాదం పద్మజ దేవి, తమ్మేలా శోభరాణి, వేముల మహేందర్, డ్యాగాల శ్రీనివాస్, అజయ్ సింగ్,అన్వేష్ , రాజశేఖర్,కాగితపు నాగరాజు,అనిల్, సుమన్ రాజ్, నితిన్,వినోద్ తదితరులు పాల్గొన్నారు
-
Home
-
Menu
