ములుగులో జోరుగా కోడి పందాలు

ములుగులో జోరుగా కోడి పందాలు
X

ములుగు జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. స్థానిక నాయకుల అండతో దర్జాగా 1000 మందితో ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి కోడి పందాల పోటీలు నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.50 లక్షలు వరకు బెట్టింగ్ జరుగుతుంది. కానీ ఏమీ తెలియనట్లు పోలీసులు నటిస్తున్నారు. ములుగు జిల్లాలో వివిధ పార్టీల నాయకుల అండతో 1000 మంది సభ్యులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి జోరుగా కోడి పందాలను ఓ ముఠా నిర్వహిస్తుంది. తెలంగాణలో కోడి పందాల మీద నిషేధం ఉండడంతో, బెట్టింగ్ రాయుళ్లని ప్రత్యేక వాహనాల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి నిర్వాహకులు తరలిస్తున్నారు. రూ.200 ఎంట్రీ టికెట్ తీసుకుంటేనే పందాలకు ప్రవేశం కల్పిస్తున్నారు. "కేబుల్ కటింగ్" పేరుతో బెట్టింగ్ వేసే వారి దగ్గర వాటాలను కట్ చేస్తున్నట్టు సమాచారం. బుధవారం, శుక్రవారం, ఆదివారం మూడు రోజుల్లో పందాలు నిర్వహించి, ఒక్క రోజుకు దాదాపు రూ.50 లక్షలు బెట్టింగ్ జరుగుతుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పందాలు వేసే వారిలో ఎక్కువగా కూలి పని చేసే వారే ఉన్నారని, కష్టపడిన డబ్బు అంత పందాల్లో పోగొడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Next Story