మునిగిన ఎంజిబిఎస్.. సజ్జనార్ కీలక సూచన

మునిగిన ఎంజిబిఎస్.. సజ్జనార్ కీలక సూచన
X

హైదరాబాద్: మూసీ సదికి భారీ వరద కారణంగా ఎంజిబిఎస్ ప్రాంగణంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆర్టిసి ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రయాణికులకు సూచనలు ఇచ్చారు. ఎంజిబిఎస్‌ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని సజ్జనార్ తెలిపారు. ‘‘ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జెబిఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్‌ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్‌ నుంచి వెళ్తున్నాయి’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

పొరపాటున ఎవరైనా ప్రయాణికులు ఎంజిబిఎస్‌కు వస్తే.. వారిని తరలించేందుకు అవసరమైనన్నీ లోకల్ బస్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకూ ఎంజిబిఎస్‌కు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story