ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి
X

జకార్తా: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండోనేషియా రాజదాని జకార్తాలో ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించిన మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. భవనం నుండి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం సమయంలో భవనం మొదటి అంతస్తులో మంటలు అలుముకుని, ఆపై పై అంతస్తులకు వ్యాపించిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా, మరికొందరు కార్యాలయం నుండి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story