టిడిపి నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారు: మిథున్ రెడ్డి

టిడిపి నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారు: మిథున్ రెడ్డి
X

అమరావతి: టిడిపి నేతలు దాడులు చేస్తున్నాపోలీసులు పట్టించుకోలేదని వైసిపి మాజీ మంత్రి మిథున్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం దుర్మార్గమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపిలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, గతంలో తనపై దాడి చేసి తిరిగి తనపైనే కేసు పెట్టారని మండిపడ్డారు. టిడిపి నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారని, పోలీస్ వ్యవస్థ టిడిపి చేతుల్లోకి వెళ్లిపోయిందని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు.

Tags

Next Story