పెగడపల్లి పరిధిలో పెద్దపులి సంచారం

X
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీ సమీప చేలల్లో పనిచేసేవారు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. పశువులు, గొర్రెల కాపరులు తదుపరి సమాచారమిచ్చే వరకు అడవిలోకి వెళ్లరాదన్నారు. పులి పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పంట పొలాల చుట్టూ కరెంట్ కంచెలు, ఉచ్చులు వేయరాదని సూచించారు.
Next Story
-
Home
-
Menu
