అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్.. అన్నదమ్ములు మృతి

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం ఎక్స్ రోడ్డు వద్ద గురువారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. అదుపుతప్పిన బైక్ చెట్టుకు ఢీకొంది.ఈ ప్రమాదంలో తిరుమలగిరి మండలం, మాలిపురం గ్రామానికి చెందిన వేముల నాగరాజు (26), వేముల కార్తీక్ (24) అనే అన్నదమ్ములు మృతి చెందారు. మృతుల్లో అన్న వేముల నాగరాజు హైదరాబాద్లోని ఇబ్రహీపట్నంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తమ్ముడు కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రమాదానికి గురై చనిపోయినట్లు బంధువులు తెలిపారు. తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరా పండుగకు వచ్చి మళ్లీ హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో తుంగతుర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానాకు తరలించినట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు.
-
Home
-
Menu
