యాదాద్రి భువనగిరిలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

X
యాదాద్రి భువనగిరి: ఇద్దరు పిల్లను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐశ్వర్య అనే వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులు మధ్య గత కొన్ని రోజల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో పది నెలల శిశులు, రెండేళ్ల కుమారుడిని చంపి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
